ఎమ్మెల్యే ఇంటివద్ద సొంత పార్టీ నేతల నిరసన

గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ కు సొంత పార్టీ నుంచే నిరసనలు తగులుతున్నాయి. ఎమ్మెల్యే తమను పట్టించుకోవడం లేదంటూ మండల స్థాయి వైసీపీ నాయకులు ఆందోళనకు దిగారు. [more]

Update: 2020-11-03 07:45 GMT

గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ కు సొంత పార్టీ నుంచే నిరసనలు తగులుతున్నాయి. ఎమ్మెల్యే తమను పట్టించుకోవడం లేదంటూ మండల స్థాయి వైసీపీ నాయకులు ఆందోళనకు దిగారు. వరప్రసాద్ ఇంటి ముందు వైసీపీ నేతలు బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు. వరప్రసాద్ గెలిచిన నాటి నుంచి తమను పట్టించుకోవడం లేదని, అధిష్టానం జోక్యం చేసుకుని ఎమ్మెల్యే వరప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. కాగా వరప్రసాద్ పై గూడూరులోని ఒక వర్గం నేతలు గత కొంతకాలంగా అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News