మీరే గెలుస్తున్నారంటూ వైసీపీ అభ్యర్థికి వంశీ ఫోన్

ఎన్నికలు ముగిసి 20 రోజులు అవుతున్నా కృష్ణా జిల్లా గన్నవరంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు [more]

Update: 2019-05-03 10:10 GMT

ఎన్నికలు ముగిసి 20 రోజులు అవుతున్నా కృష్ణా జిల్లా గన్నవరంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఫోన్ చేయడం, వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్లడంతో మరోసారి వివాదం రాజుకుంది. ఇటీవల వల్లభనేని వంశీ.. వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు ఫోన్ చేసి ‘మీరే గెలుస్తున్నారు.. మీ ఇంటికి వచ్చి సన్మానం చేస్తా’’ అని వెటకారంగా అన్నారట. తర్వాత రెండు రోజులకు ఏకంగా వెంకట్రావు ఇంటికే వంశీ వెళ్లగా ఆయన ఇంట్లో లేరు. ఇక, వైసీపీకి నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్న దాసరి బాలవర్ధనరావుకు సైతం వంశీ ఫోన్ చేసి ఇదే విధంగా మాట్లాడారు. దీంతో వీరిద్దరు నేతలు విజయవాడ సీపీని కలిసి వంశీపై ఫిర్యాదు చేశారు. వంశీ తమను బెదిరిస్తున్నారని, ఫోన్లు చేస్తున్నారని, ఏకంగా ఇంటికి కూడా వచ్చారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని సీపీకి అందజేశారు. అయితే, ఎన్నికల వేళ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు చల్లార్చేందుకే వారి ఇంటికి వెళ్లినట్లు వంశీ వర్గీయులు చెబుతున్నారు.

Tags:    

Similar News