వీహెచ్ వ్యాఖ్యలపై హైకమాండ్ సీరియస్

కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు కామెంట్స్ పై హైకమాండ్ సీరియస్ అయింది. ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ వ్యవహారాల ఇన్ [more]

Update: 2020-12-26 07:52 GMT

కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు కామెంట్స్ పై హైకమాండ్ సీరియస్ అయింది. ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాగూర్ విహెచ్ వ్యాఖ్యలపై నివేదికను తెప్పించుకున్నారు. మాణికం ఠాగూర్ కూడా అభిప్రాయ సేకరణ సరిగా నిర్వహించలేదని, హైకమాండ్ ను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుంది. పార్టీలో క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఎంతటి సీనియర్ నేతలనైనా ఉపేక్షించబోమని హెచ్చరికలు జారీ చేయడానికి వీహెచ్ కు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది.

Tags:    

Similar News