బిగ్ బ్రేకింగ్ : మళ్లీ ‘ఓటుకు నోటు’ ఆరోపణలు

Update: 2018-12-10 11:06 GMT

తెలంగాణలో ‘ఓటుకు నోటు’ ఆరోపణలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తనను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారని నాగర్ కర్నూల్ నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్ధన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ మధ్యాహ్నం 2.07 గంటలకు 9490861960 నెంబరు నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి ఫోన్ చేసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరినట్లు ఆరోపించారు. జానారెడ్డి ఇంట్లో సమావేశం ఉందని మాట్లాడుకుందామని ఆహ్వానించినట్లు తెలిపారు. ఇది సరికాదని తాను ఫోన్ పెట్టేయగా... 2.56కి మరోసారి ఫోన్ చేసినట్లు చెప్పారు. అయితే, కేసీఆర్ పూర్తి మెజారిటీతో గెలుస్తారని, చంద్రబాబు కుట్రల్లో భాగం కావద్దని జవాబు చెప్పి ఫోన్ పెట్టేసినట్లు ఆయన వివరించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను చంద్రబాబు మార్గదర్శకంలో ప్రలోభపెట్టి లాగే ప్రయత్నం చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.

Similar News