ttd board : టీటీడీ పాలకమండలి ఇదేనట

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నియామకం కసరత్తు పూర్తయింది. త్వరలో ఈ కమిటీ ప్రకటన ప్రభుత్వం విడుదల చేయనుంది. కొత్త పాలకమండలి సభ్యుల్లో 28 మంది సభ్యులు [more]

Update: 2021-09-15 04:45 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నియామకం కసరత్తు పూర్తయింది. త్వరలో ఈ కమిటీ ప్రకటన ప్రభుత్వం విడుదల చేయనుంది. కొత్త పాలకమండలి సభ్యుల్లో 28 మంది సభ్యులు ఉన్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి పోకల అశోక్ కుమార్, కాటసాని రాంభూంపాల్ రెడ్డి, మల్లాడి కృష్ణారావు, ఎమ్మెల్యేలు గొర్లబాబూరావు, బుర్రా మధుసూదన్ యాదవ్, తెలంగాణ నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, మైహోం రామేశ్వరరావు, లక్ష్మీనారాయణ, పార్థసారధి రెడ్డి, మారంశెట్టి రాములు, కల్వకుర్తి విద్యాసాగర్ లు ఉన్నారు. తమిళనాడు నుంచి నందకుమార్, శశిధర్, కన్నయ్య పేర్లు ఉన్నాయి. కన్నయ్య పేరును తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సిఫార్సు చేశారు. కన్నయ్య పై అక్రమాస్తుల అభియోగాలున్నాయి. కర్ణాటక నుంచి శశిధర్, విశ్వానాధ్ లు, మహారాష్ట్ర నుంచి శివసేన నేత మిలింద్ పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News