బ్రేకింగ్ : జగన్ సమక్షంలో చేరిపోయారు

తెలుగుదేశం పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన తోట త్రిమూర్తులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కొద్దిసేపటి క్రితం తాడేపల్లిలో జగన్ నివాసానికి తన అనుచరులతో కలసి [more]

Update: 2019-09-15 07:08 GMT

తెలుగుదేశం పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన తోట త్రిమూర్తులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కొద్దిసేపటి క్రితం తాడేపల్లిలో జగన్ నివాసానికి తన అనుచరులతో కలసి చేరుకున్నారు. జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరై తిరిగి ఇంటికి వచ్చిన జగన్ సమక్షంలో తోట త్రిమూర్తులు వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈరోజు నుంచి రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడతానన్నారు తోట త్రిమూర్తులు. సమర్థవంతమైన నాయకత్వం అవసరమని ప్రజలు భావించారన్నారు. తోట త్రిమూర్తులు వెంట ప్రస్తుత ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఉండటం విశేషం.

Tags:    

Similar News