బ్రేకింగ్ : ఘోర ప్రమాదం… యాభై మంది గల్లంతు

మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణీకులతో వెళుతున్న ఒక బస్సు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. మొత్తం యాభై మంది గల్లంతయినట్లు సమాచారం. రెవా నుంచి సిధి [more]

Update: 2021-02-16 06:45 GMT

మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణీకులతో వెళుతున్న ఒక బస్సు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. మొత్తం యాభై మంది గల్లంతయినట్లు సమాచారం. రెవా నుంచి సిధి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే స్థానికులు అప్రమత్తమై ఏడుగురు ప్రయాణికులను రక్షించగలిగారు. దాదాపు యాభై మంది ప్రయాణికుల ఆచూకీ తెలియడం లేదు. గజఈతగాళ్ల సాయంతో సహాయక చర్యలను మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది.

Tags:    

Similar News