గుంటూరువాసులకు సర్కార్ వారి హెచ్చరికలు

గుంటూరు కరోనా వైరస్ వ్యాప్తితో అల్లాడిపోతుంది. దీంతో గుంటూరులో లాక్ డౌన్ ను మరింత కట్టదిట్టం చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు కలెక్టర్ రోజు విడిచి [more]

Update: 2020-04-14 02:50 GMT

గుంటూరు కరోనా వైరస్ వ్యాప్తితో అల్లాడిపోతుంది. దీంతో గుంటూరులో లాక్ డౌన్ ను మరింత కట్టదిట్టం చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు కలెక్టర్ రోజు విడిచి రోజు మాత్రమే నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయడానికి రోడ్డు మీదకు రావాలని ప్రజలను కోరారు. ఒక్క గుంటూరు జిల్లలోనే కరోనా పాజిటివ్ కేసులు 91కి దాటాయి. దీంతో ప్రతి రోజూ ఉదయం ఆరు గంటల నుంచి 9గంటల వరకూ ఉండే మినహాయింపును గుంటూరులో కట్ చేశారు. ఇక రోజు విడిచి రోజు మాత్రమే నిత్యావసర వస్తువుల కొనుగోలుకు అనుమతిస్తారు. మిగిలిన రోజుల్లో పూర్తి లాక్ డౌన్ ఉటుందని, ఎవరు బయటకు వచ్చినా కేసులు తప్పవని అధికారులు హెచ్చరించారు.

Tags:    

Similar News