జగన్ తో పొత్తుపై టీజీ

బీజేపీతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ కలసే అవకాశం లేకపోలేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువుల, శాశ్వత మిత్రులు ఉండరన్న టీజీ [more]

Update: 2020-02-15 13:12 GMT

బీజేపీతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ కలసే అవకాశం లేకపోలేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువుల, శాశ్వత మిత్రులు ఉండరన్న టీజీ వెంకటేష్ రాజకీయాల్లో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చని తెలిపారు. 2019 ఎన్నికల్లో బీజేపీ పరోక్ష సహకారంతోనే వైసీీపీకి అధిక స్థానాలు వచ్చాయని టీజీ వెంకటేష్ తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు టీజీ వెంకటేష్. ఏది జరగినా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదన్నారు. ఆయన కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News