బ్రేకింగ్ : తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్-Dec 24

తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ వర్గీయులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోపం ఆపుకోలేని [more]

Update: 2020-12-24 08:40 GMT

తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ వర్గీయులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోపం ఆపుకోలేని పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో జేసీ ప్రభాకర్ రెడ్డి, పెద్దారెడ్డిలకు చెందిన పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇరు వర్గాలు పెద్దయెత్తున మొహరించడంతో పెద్దయెత్తున పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకుంటుండటంతో టెన్షన్ నెలకొంది. ఎడ్లబండిలో తీసుకెళుతున్న ఇసుక కూడా సొమ్ములు వసూలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో జేసీ అనుచరులు పోస్ట్ చేయడంతోనే ఈ వివాదం తలెత్తింది.

Tags:    

Similar News