కోడెల విగ్రహం…ఉద్రిక్తత

గుంటూరు జిల్లా యడ్లపాడు గ్రామంలో కోడెల శివప్రసాద్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు టీడీపీ నేతలు సన్నాహాలు చేశారు. ఇందుకోసం దిమ్మెను కూడా నిర్మించారు. అయితే అధికారులు మాత్రం [more]

Update: 2019-09-30 03:44 GMT

గుంటూరు జిల్లా యడ్లపాడు గ్రామంలో కోడెల శివప్రసాద్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు టీడీపీ నేతలు సన్నాహాలు చేశారు. ఇందుకోసం దిమ్మెను కూడా నిర్మించారు. అయితే అధికారులు మాత్రం కోడెల శివప్రసాద్ విగ్రహానికి అనుమతి లేదంటూ దిమ్మెను కూల్చేశారు. దీంతో యడ్లపాడు గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. కాగా ఈరోజు కోడెల శివప్రసాద్ సంతాప సభను టీడీపీ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా నేతలు హాజరుకానున్నారు.

Tags:    

Similar News