టీడీపీకి భారీ షాక్ తగలనుందా?

ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి జంప్ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. వీరితో ఇప్పటికే వైసీపీ నేతలు మంతనాలు ప్రారంభించారని తెలుస్తోంది. ప్రకాశం జిల్లాలో [more]

Update: 2019-12-04 04:17 GMT

ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి జంప్ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. వీరితో ఇప్పటికే వైసీపీ నేతలు మంతనాలు ప్రారంభించారని తెలుస్తోంది. ప్రకాశం జిల్లాలో ఉన్న ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డితో భేటీ అయ్యారని సమాచారం. మంత్రి బాాలినేనితో పాటు కొడాలి నాని, పేర్ని నాని కూడా వీరితో ఉన్నట్లు తెలుస్తుంది. వీరు ముగ్గురు నేడు సీఎం జగన్ ను కలిసే అవకాశముంది. వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ కు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు పడిపోతారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది. అయితే ప్రకాశం జిల్లాలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు అంటే కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయ స్వామిలు ఈ భేటీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. కరణం, గొట్టిపాటి తిరిగి ఒక పార్టీలో చేరతారా? అన్నది అనుమానంగానే ఉన్నా వైసీపీ ఇచ్చే ఆఫర్ ను బట్టి వీరు టీడీపీని వదిలే అవకాశముందంటున్నారు.

Tags:    

Similar News