పార్టీలో సీనియర్లు సీరియస్…బాబు పర్యటనను?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విశాఖ పర్యటనను అడ్డుకోవడంపై సీనియర్లు సీరియస్ అయ్యారు. చంద్రబాబుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని వారు ఖండించారు. మాజీ మంత్రులు యనమల [more]

Update: 2020-02-28 02:29 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విశాఖ పర్యటనను అడ్డుకోవడంపై సీనియర్లు సీరియస్ అయ్యారు. చంద్రబాబుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని వారు ఖండించారు. మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలు ప్రభుత్వ చర్యలను తప్పుపట్టారు. పులివెందుల నుంచి గూండాలను తెప్పించి చంద్రబాబు పర్యటనను అడ్డుకున్నారని వారు ఆరోపించారు. అరాచకాలను చేయడానికి పోలీసు వ్యవస్థను వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. విశాఖ ప్రజలు చంద్రబాబును అడ్డుకున్నారంటే ఎవరూ నమ్మరని తెలిపారు. ప్రజా చైతన్య యాత్రలకు వస్తున్న స్పందన చూసి ఓర్వలేక బాబు పర్యటనను వైసీపీ అడ్డుకుందని వారు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వాన్ని వెంటనే బర్త్ రఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News