గవర్నర్ స్పందన భేష్

గవర్నర్ తమ ఫిర్యాదు పట్ల సీరియస్ గా స్పందించారని, పోలీసులను ఆదేశిస్తానని తెలిపారని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గవర్నర్ స్పందన తమకు సంతృప్తి నిచ్చిందన్నారు. గవర్నర్ [more]

Update: 2019-12-03 06:53 GMT

గవర్నర్ తమ ఫిర్యాదు పట్ల సీరియస్ గా స్పందించారని, పోలీసులను ఆదేశిస్తానని తెలిపారని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గవర్నర్ స్పందన తమకు సంతృప్తి నిచ్చిందన్నారు. గవర్నర్ ను కలసిన అనంతరం టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. అమరావతికి వచ్చిన చంద్రబాబుపై చెప్పులు, రాళ్లతో దాడి చేయిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము పర్యటన కోసం అద్దెకు తీసుకున్న బస్సును కూడా సీజ్ చేశారని తెలిపారు. తమ బస్సుపై పడిన లాఠీ ఎవరితో డీజీపీ చెప్పాలని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమయిందన్నారు. చంద్రబాబు పర్యటన, దాడి ఘటనలపై గవర్నర్ కు టీడీపీ నేతలు ఫిర్యాుద చేశారు.

Tags:    

Similar News