టీడీపీ నేతల హౌస్ అరెస్ట్

ఇసుక కొరతపై తెలుగుదేశం పార్టీ నిరసన దీక్షకు దిగింది. మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇసుక కొరతపై 36 గంటల దీక్షకు దిగనున్నారు. దీంతో మచిలీపట్నం [more]

Update: 2019-10-11 03:41 GMT

ఇసుక కొరతపై తెలుగుదేశం పార్టీ నిరసన దీక్షకు దిగింది. మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇసుక కొరతపై 36 గంటల దీక్షకు దిగనున్నారు. దీంతో మచిలీపట్నం లో 144వ సెక్షన్ ను విధించారు. ఇప్పటికే టీడీపీ నేతల బచ్చుల అర్జునుడితో పాటు మరికొంతమందిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కొల్లు రవీంద్ర దీక్షకు బయలుదేరుతుండటంతో ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మొహరించారు. టీడీపీ నేతలు మాత్రం తాము శాంతియుతంగా దీక్ష చేస్తామని చెబుతున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

Tags:    

Similar News