ఆ నేతలు టీడీపీకి హ్యాండ్ ఇచ్చినట్లేనా..?

Update: 2018-05-24 08:33 GMT

హైదరాబాద్ లో జరుగుతున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డుమ్మా కొట్టారు. అయితే, మోత్కుపల్లి నర్సింహులు పార్టీ మారుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇందుకు జూన్ లో ముహూర్తం కూడా పెట్టుకున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన మహానాడుకు హాజరుకాలేదని తెలుస్తోంది. ఇక, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆర్.కృష్ణయ్య కూడా పార్టీతో సంబంధం లేనట్లే ఉంటున్నారు. టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు వైఖరిపై కూడా ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే నేతల వలసలతో తెలంగాణలో నిస్తేజంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు కార్యక్రమంతో ఉత్సాహం వస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతుండగా, ఉత్సాహం సంగతి పక్కనపెడితే మరింత నైరాశ్యంలోకి వెళ్లే అవకాశం ఉందంటున్నారు.

Similar News