నేటి నుంచి ఇంటివద్దకే వ్యాక్సినేషన్

థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని తెలియడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయింది. ఇంటింటికి తిరిగి వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు సిద్ధమయింది. నేటి నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని [more]

Update: 2021-08-23 02:19 GMT

థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని తెలియడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయింది. ఇంటింటికి తిరిగి వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు సిద్ధమయింది. నేటి నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించారు. కాలనీలు, బస్తీలకు సంచార వైద్య శాలలు వెళ్లి వ్యాక్సిన్ వేయనున్నారు. దాదాపు పది రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాక్సిన్ వేసుకోని వారి జాబితాను సేకరించి వారందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది.

Tags:    

Similar News