సీమ పథకాన్ని నిలిపేయండి.. జగన్ కు టీడీపీ ఎమ్మెల్యేల లేఖ

రాయలసీమ ఎత్తిపోతల పథకం విస్తరణ పనులు నిలిపేయాలని టీడీపీ ఎమ్మెల్యేలు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు. టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావులు [more]

Update: 2021-07-11 06:06 GMT

రాయలసీమ ఎత్తిపోతల పథకం విస్తరణ పనులు నిలిపేయాలని టీడీపీ ఎమ్మెల్యేలు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు. టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావులు ఈ లేఖ రాశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని విస్తరించడం వల్ల ప్రకాశం జిల్లాకు నీరు అందదని, ఈ ప్రాంత వాసులకు అన్యాయం జరుగుతుందని వారిద్దరూ జగన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. రాయలసీమ ఎత్తిపోతల విస్తరణ పథకాన్ని నిలిపేయాలని వారు కోరారు.

Tags:    

Similar News