టీడీపీ ఎమ్మెల్యే రాజీనామా

టీఆర్ఎస్ లో టీడీపీని విలీనం చేస్తున్నట్లు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రకటించారు. టీడీపీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. అనంతరం [more]

Update: 2021-04-08 01:17 GMT

టీఆర్ఎస్ లో టీడీపీని విలీనం చేస్తున్నట్లు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రకటించారు. టీడీపీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసి తమ పార్టీ విలీనం చేయాలని కోరారు. దీంతో టీఆర్ఎస్ లో టీడీపీ విలీనం అయింది. 2018 ఎన్నికల్లో టీడీపీ నుంచి సండ్ర వెంకట వీరయ్య, మెచ్చా నాగేశ్వరరావులు గెలిచారు. వీరిద్దరూ ఇప్పుడు టీఆర్ఎస్ లో చేరడంతో పార్టీ టీఆర్ఎస్ లో విలీనం అయింది. దీంతో తెలంగాణ శాసనసభలో టీడీపీకి స్థానం లేదు.

Tags:    

Similar News