కోట్ల రాకతో టీడీపీలో రేగుతున్న కాక..!

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమైంది. అయితే, ఆయన చేరిక పట్ల కర్నూలు ఎంపీ బుట్టా రేణుకతో [more]

Update: 2019-01-28 13:41 GMT

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమైంది. అయితే, ఆయన చేరిక పట్ల కర్నూలు ఎంపీ బుట్టా రేణుకతో పాటు కేఈ కుటుంబం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పార్టీలో చేరే విషయం తనకు తెలియదని కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. కోట్ల కుటుంబానికి, కేఈ కుటుంబానికి మధ్య ముందునుంచే రాజకీయ విభేదాలు ఉన్నాయి. దీనికి తోడు కోట్ల కుటుంబంలో ఒకరికి డోన్ అసెంబ్లీ సీటు ఇవ్వాలని కోరుతున్నారు. అయితే, డోన్ లో గత ఎన్నికల్లో టీడీపీ నుంచి కేఈ ప్రతాప్ పోటీ చేశారు. దీంతో ఆయనకు ఈసారి టిక్కెట్ దక్కే అవకాశం లేదు. దీంతో కేఈ కుటుంబం అసంతృప్తిలో ఉంది. ఇక, సూర్యప్రకాశ్ రెడ్డికి కర్నూలు ఎంపీ టిక్కెట్ ఇవ్వడం ఖాయం అని తెలుస్తుందడటంతో ఎంపీ బుట్టా రేణుక కూడా అసంతృప్తితో ఉన్నారు. అయితే, వీరిద్దరూ చంద్రబాబు నిర్ణయమే ఫైనల్ అని చెబుతున్నారు. ఇక, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మాత్రం కోట్ల రాకను స్వాగతించారు.

Tags:    

Similar News