Tdp : గవర్నర్ దృష్టికి దాడులు

తెలుగుదేశం పార్టీనేతలు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. టీడీపీ కార్యాలయాలపై రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దాడుల గురించి గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. పోలీసులతో కలసి [more]

Update: 2021-10-21 12:45 GMT

తెలుగుదేశం పార్టీనేతలు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. టీడీపీ కార్యాలయాలపై రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దాడుల గురించి గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. పోలీసులతో కలసి వైసీపీ నేతలు తమ కార్యాలయాలపై దాడులు చేశారన్నారు. ఈ దాడుల్లో ఏ ఒక్కరినీ ఇప్పటి వరకూ అరెస్ట్ చేయలేదన్నారు. అంతేకాకుండా తిరిగి తమ పార్టీ నేతలపై కేసులు నమోదు చేశారని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. గవర్నర్ ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు తదితరులు కలిశారు.

Tags:    

Similar News