పరువు తీసిన టీడీపీ నేతలు

Update: 2018-07-31 07:43 GMT

తమిళనాట తెలుగుదేశం పార్టీ నేతలు తెలుగువారి పరువు తీశారు. ఏకంగా ప్రభుత్వ సర్వర్లనే హ్యాక్ చేసి మోసానికి తెరలేపారు. తమిళనాడు ప్రభుత్వం నిర్వహించే ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షల్లో కావాల్సినన్ని మార్కులు కలుపుతామంటూ ముగ్గురు టీడీపీ నేతలతో కూడిన కే స్క్వేర్ గ్యాంగ్ పెద్ద ఎత్తున విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసింది. అనంతరం ప్రభుత్వ సర్వర్లను హ్యాక్ చేసి డాటా చోరీ చేసి, మార్కులు కలిపేందుకు ప్రయత్నించింది. ఈ విషయం పసిగట్టిన తమిళనాడు విద్యాశాఖ అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు హ్యాకర్ల గుట్టు రట్టు చేశారు. ఈ మోసంలో కీలకంగా ఉన్న వెంకట్రావ్ ప్రవీణ్ చౌదరి, సుధాకర్ లను పుల్లల్ సెంట్రల్ జైల్ కు తరలించారు. వీరు తమిళనాడు టీడీపీ శాఖలో ముఖ్య నేతలుగా కొనసాగుతున్నారు.

Similar News