చంద్రబాబు నివాసం ఎదుట కార్యకర్తల ఆందోళన

తెలుగుదేశం పార్టీలో టిక్కెట్ల లొల్లి చంద్రబాబు ఇంటి ముందు ఆందోళనకు దారి తీసింది. పుట్టపర్తి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి వ్యతిరేకంగా ఉన్న [more]

Update: 2019-03-12 11:45 GMT

తెలుగుదేశం పార్టీలో టిక్కెట్ల లొల్లి చంద్రబాబు ఇంటి ముందు ఆందోళనకు దారి తీసింది. పుట్టపర్తి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి వ్యతిరేకంగా ఉన్న పార్టీ నేతలు అమరావతిలో చంద్రబాబు నివాసం వద్ద ఆందోళన చేశారు. పల్లెకు టిక్కెట్ ఇవ్వవద్దని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక, రంపచోడవరం నియోజకవర్గంలో కూడా ఫిరాయింపు ఎమ్మెల్యే రాజేశ్వరికి టిక్కెట్ ఇవ్వవద్దని కోరుతూ ఆమె వ్యతిరేకత వర్గం నేతలు సైతం చంద్రబాబు ఇంటి వద్ద ఆందోళనకు దిగారు.

Tags:    

Similar News