తాడేపల్లికి చేరుకున్న రామసుబ్బారెడ్డి

జమ్మలమడుగు టీడీపీ నేత రామసుబ్బారెడ్డి తాడేపల్లి చేరకున్నారు. ఆయన ఈరోజు మధ్యాహ్నం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. రామసుబ్బారెడ్డితో పాటు పలువురు టీడీపీ నేతలు, ఆయన అనుచరులు [more]

Update: 2020-03-11 05:40 GMT

జమ్మలమడుగు టీడీపీ నేత రామసుబ్బారెడ్డి తాడేపల్లి చేరకున్నారు. ఆయన ఈరోజు మధ్యాహ్నం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. రామసుబ్బారెడ్డితో పాటు పలువురు టీడీపీ నేతలు, ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. నిన్న కూడా రామసుబ్బారెడ్డి తాను టీడీపీలోనే ఉన్నానని మీడియాకు తెలిపారు. అయితే నిన్న రాత్రే జమ్మలమడుగు నుంచి బయలుదేరి విజయవాడకు చేరుకున్నారు. మరికాసేపట్లో వైసీపీలోకి రామసుబ్బారెడ్డి చేరనున్నారు. ప్రస్తుతం రామసుబ్బారెడ్డి వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డితో చర్చలు జరుపుతున్నారు.

Tags:    

Similar News