జగన్ వన్నీ అబద్ధాలే

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వి అబద్దాలేనని పోలవరం ప్రాజెక్టు విషయంలో తేలిందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు.అమెరికాలో ఉన్న చంద్రబాబు ట్విట్టర్లో స్పందించారు. జగన్ పాదయాత్రలో [more]

Update: 2019-08-01 14:17 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వి అబద్దాలేనని పోలవరం ప్రాజెక్టు విషయంలో తేలిందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు.అమెరికాలో ఉన్న చంద్రబాబు ట్విట్టర్లో స్పందించారు. జగన్ పాదయాత్రలో ఉన్న సమయంలో పోలవరం ప్రాజెక్టుకు పునాదులే పడలేదని అన్నారని, కాని నేడు రివర్స్ స్లూయిజ్ గేట్ల ద్వారా రెండు లక్షల క్యూసెక్కుల వరదనీటిని ఎలా మళ్లించారని చంద్రబాబు ప్రశ్నించారు. తాము 70 శాతం పోలవరం పనులను పూర్తి చేశామన్న చంద్రబాబు మిగిలిన 30 శాతం పనులు పూర్తి చేయకుంటే పోలవరం కలగానే మిగులుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News