జగన్ గురించి బాబు వీడియో చూపించి మరీ

అమరావతిని భ్రష్టు పట్టించారని వైసీపీ నేతలపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఫైరయ్యారు. ప్రపంచ బ్యాంకుతో పాటు ఏఏబీపీ కూడా రుణాలను ఇచ్చేందుకు తిరస్కరించిందన్నారు. శాసనసభ సమావేశాల్లో తనపై [more]

Update: 2019-07-24 12:56 GMT

అమరావతిని భ్రష్టు పట్టించారని వైసీపీ నేతలపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఫైరయ్యారు. ప్రపంచ బ్యాంకుతో పాటు ఏఏబీపీ కూడా రుణాలను ఇచ్చేందుకు తిరస్కరించిందన్నారు. శాసనసభ సమావేశాల్లో తనపై దాడి చేసేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఎప్పుడో జరిగిన పుష్కరాల ఘటనలకు కూడా తెస్తున్నారన్నారు. తమ పార్టీ శాసనసభ్యుల సస్పెన్షన్ పై తనకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతును నొక్కేస్తున్నారు. జగన్ చర్యల వల్ల అమరావతిలో రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయిందన్నారు. బంగారు బాతు గుడ్డుగా అమరావతిని మలచాలని తాను అనుకుంటే దానిని జగన్ చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అడుగడుగునా చేతకానితనంతో రాష్ట్రాన్ని అనాధగా మారుస్తున్నారన్నారు. ఇంతటి అరాచకమైన శాసనసభ సమావేశాలను తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు. 1970వ దశకంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రొఫెసర్ హరగోపాల్ తో చెప్పిన మాటలను చంద్రబాబు వీడియో ద్వారా మీడియాకు చూపించారు. పులివెందుల రాజకీయాలను రాష్ట్రమంతటా పాకించాలని జగన్ చూస్తున్నారన్నారు.

Tags:    

Similar News