వైసీపీ అభ్యర్థులపై టీడీపీ నేతల దాడులు

ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ సందర్భంగా పెద్ద ఎత్తున ఘర్షణలు జరుగుతున్నాయి. రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. చిత్తూరు జిల్లా పుతలపట్టు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే [more]

Update: 2019-04-11 09:58 GMT

ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ సందర్భంగా పెద్ద ఎత్తున ఘర్షణలు జరుగుతున్నాయి. రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. చిత్తూరు జిల్లా పుతలపట్టు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ బాబుపై తెలుగుదేశం నాయకులు దాడికి పాల్పడ్డారు. టీడీపీ నేతల దాడిలో ఎంఎస్ బాబుకు గాయాలయ్యాయి. ఆయన వాహనం కూడా ధ్వంసమైంది. గురజాల నియోజకవర్గం మాచవరం మండలం కొత్తగణేషునిపాలెంలో కొందరు దళితులను ఓటింగ్ కు వెళ్లకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఈ సమాచారం అందుకున్న వైసీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి గ్రామానికి వెళ్లారు. దీంతో టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా ఆయనపై దాడికి దిగారు. ఆయన కార్లను ధ్వంసం చేశారు. ఉదయం కూడా నరసరావుపేట వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై టీడీపీ నేతలు దాడి చేసి గాయపరిచారు.

Tags:    

Similar News