బాబు యాక్షన్ ప్లాన్ ఇదే

Update: 2018-04-05 13:45 GMT

రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకోసం చర్చించేందుకు ఈ నెల ఏడోతేదీన అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు చంద్రబాబు. అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించడానికి రెడీ అవుతున్నారు చంద్రబాబు. కొద్దిసేపటి క్రితం మంత్రులు, ప్రజాప్రతినిధులతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. రేపు ఉదయం అన్ని నియోజకవర్గాల్లో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సైకిల్ యాత్రలు, బస్సు యాత్రలను నిర్వహించాలని టీడీపీ శ్రేణులకు ఆ పార్టీ పిలుపునిచ్చింది. పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ప్రజా ప్రతినిధులు కలిసి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బస్సుయాత్రలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన అన్యాయం గురించి వివరించే కార్యక్రమం చేపట్టాలని టీడీపీ నిర్ణయించింది. ఎంపీల బస్సు యాత్రకు ఆంధ్రుల ఆత్మగౌరవ యాత్రగా నామకరణం చేశారు. ప్రతి జిల్లా కేంద్రంలోనూ సభను నిర్వహించనుంది టీడీపీ.

Similar News