రెచ్చిపోతున్న తాలిబన్లు… 150 మంది కిడ్నాప్

ఆప్ఘనిస్థాన్ లో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. అమెరికా సైన్యాన్ని ఉపసంహరించిన తర్వాత తాలిబన్లు మరింత దాడులకు పాల్పడుతున్నారు. ఈరోజు కాబూల్ ఎయిర్ పోర్టులో తాలిబన్ లు 150 మందిని [more]

Update: 2021-08-21 07:12 GMT

ఆప్ఘనిస్థాన్ లో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. అమెరికా సైన్యాన్ని ఉపసంహరించిన తర్వాత తాలిబన్లు మరింత దాడులకు పాల్పడుతున్నారు. ఈరోజు కాబూల్ ఎయిర్ పోర్టులో తాలిబన్ లు 150 మందిని కిడ్నాప్ చేశారని తెలిసింది. వీరిలో ఎక్కువ మంది భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటి వరకూ భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పందించకపోయినా వారంతా కిడ్నాప్ నకు గురయ్యారని తెలిసింది. ఇతర దేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారిని తాలిబన్లు తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. దీనిపై అధికారులు స్పందించాల్సి ఉంది. చాలామందిని కొడుతుండటంతో కాబూల్ ఎయిర్ పోర్టులో హాహాకాారాలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News