తలసానికి తలంటారు

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు జీహెచ్ఎంసీ అధికారులు జరిమానా విధించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినందుకు జీహెచ్ఎంసీ అధికారులు ఐదు వేలు [more]

Update: 2020-02-15 12:40 GMT

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు జీహెచ్ఎంసీ అధికారులు జరిమానా విధించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినందుకు జీహెచ్ఎంసీ అధికారులు ఐదు వేలు జరిమానా విధించారు. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ నగరంలోని పలు ప్రాంతాల్లో వియ్ లవ్ కేసీఆర్ అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే అనుమతి లేకుండా ఫ్లెక్సీలను, కటౌట్లను ఏర్పాటు చేసినందుకు తలసానికి ఫైన్ వేశారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఐదువేల రూపాయలు ఫైన్ ను జీహెచ్ఎంసీకి చెల్లించడం విశేషం.

Tags:    

Similar News