పృధ్వీకి ఊస్టింగ్ తప్పదా?

ప్రముఖ హాస్య నటుడు, ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీరాజ్ పై వైసీపీ అధిష్టానం చర్యలకు తీసుకునే అవకాశముంది. ఇటీవల రాజధానిలో ఆందోళన చేస్తున్న రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో [more]

Update: 2020-01-12 05:19 GMT

ప్రముఖ హాస్య నటుడు, ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీరాజ్ పై వైసీపీ అధిష్టానం చర్యలకు తీసుకునే అవకాశముంది. ఇటీవల రాజధానిలో ఆందోళన చేస్తున్న రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పృథ్వీరాజ్ పై అన్ని పార్టీలూ అభ్యంతరం వ్యక్తం చేశాయి. పోసాని కృష్ణమురళి, అశ్వనీదత్ లు సయితం పృధ్వీపై విమర్శలు చేశారు. ఇదిలా ఉండగా పృధ్వీరాజ్ తాజాగా ఎస్వీబీసీ ఛైర్మన్ ఆడియో టేపులు కలకలం రేపుతున్నాయి. ఎస్వీబీసీ ఛానల్ లో పనిచేసే ఒక మహిళ ఉద్యోగినిపై పృధ్వీరాజ్ అసభ్యకరంగా మాట్లాడుతున్న ఆడియో టేపులు పృధ్వీకి ఇబ్బందికరంగా మారింది. దీనిపై ఉద్యోగ సంఘాలు కూడా మండిపడుతున్నాయి. వరస వివాదాల్లో చిక్కుకున్న పృధ్వీరాజ్ పై వైసీపీ అధిష్టానం చర్యలు తీసుకునే అవకాశముందంటున్నారు.

Tags:    

Similar News