సుష్మ స్వరాజ్ కి కొపమొచ్చింది

Update: 2018-07-03 09:03 GMT

ఓ పాస్ పోర్టు అధికారిని బదిలీ చేసి సోషల్ మీడియాతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సుష్మా స్వరాజ్ కి ఓ నెటిజన్ మరింత కోపం తెప్పించింది. ఇటీవల భిన్న మతాలకు చెందిన దంపతులకు లఖ్నోలో ఓ పాస్ పోర్టు అధికారి పాస్ పోర్టులు ఇవ్వడానికి నిరాకరించాడు. వారితో అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో వారు విషయాన్ని సుష్మా దృష్టికి తీసుకెళ్లగా ఆమె వెంటనే స్పందించి సదరు అధికారిని బదిలీ చేశారు. దీంతో కొందరు నెటిజన్లు ఆమెపై విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సోనమ్ మహజన్ అనే మహిళ...సుష్మను ఉద్దేశించి ‘ నేను ఇంతకుముందు మీ అభిమానిని.. కానీ ఇప్పుడు మాత్రం కాదు. దయచేసి నన్ను మీ ఖాతా నుంచి బ్లాక్ చెయ్యండి’ అని ట్వీట్ చేసింది. దీంతో సుష్మకు చిర్రెత్తి..ఇంకెందుకు ఆలస్యం..మిమ్మల్ని బ్లాక్ చేస్తున్నాను అని ట్వీట్ చేసి బ్లాక్ చేసేసింది.

Similar News