బ్రేకింగ్ : కాశ్మీర్ పై సుప్రీం కీలక నిర్ణయం

జమ్మూ కాశ్మీర్ అంశంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. కాశ్మీర్ లో ఇంటర్నెట్ సేవలను తక్షణం పునరుద్ధరించాలని ఆదేశించింది. ప్రజల హక్కులకు ఎలా భంగం కల్గిస్తారని వ్యాఖ్యానించింది. [more]

Update: 2020-01-10 05:42 GMT

జమ్మూ కాశ్మీర్ అంశంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. కాశ్మీర్ లో ఇంటర్నెట్ సేవలను తక్షణం పునరుద్ధరించాలని ఆదేశించింది. ప్రజల హక్కులకు ఎలా భంగం కల్గిస్తారని వ్యాఖ్యానించింది. పత్రికాస్వేచ్ఛకు ఎలా అడ్డంకులు కల్పిస్తారంది. ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. కాశ్మీర్ లో 144వ సెక్షన్ పై పునరాలోచించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. వెంటనే ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎమెర్జెన్సీ ఉందని ప్రజల హక్కులకు భంగం కల్పిస్తారా? అని ప్రశ్నించింది.

Tags:    

Similar News