సుజనాకు వైసీపీ ఎంపీల ఘాటు కౌంటర్

సుజనా నువ్వు టీడీపీలో ఉన్నావా? బీజేపీలో ఉన్నావా? చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు కోరారు. సుజనాతో వైసీపీ ఎంపీలు ఎవరు టచ్ లో ఉన్నారో చెప్పాలని వారు [more]

Update: 2019-11-22 08:52 GMT

సుజనా నువ్వు టీడీపీలో ఉన్నావా? బీజేపీలో ఉన్నావా? చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు కోరారు. సుజనాతో వైసీపీ ఎంపీలు ఎవరు టచ్ లో ఉన్నారో చెప్పాలని వారు కోరారు. ఢిల్లీలో వైసీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేతలే జగన్ తో కలిసేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. రాష్ట్రాన్ని సుజనా చౌదరి అమ్ముకుని బతికారని వారు ఎద్దేవా చేశారు. బీజీపీలో ఉంటూ తెలుగుదేశం ఏజెంటుగా పనిచేస్తున్నారని విమర్శించారు. బ్యాంకులకు ఆరువేల కోట్ల రూపాయలను ఎగ్గొట్టిన సుజనా చౌదరి నీతులు చెబుతున్నారన్నారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే టీడీపీ బతికి బట్ట కూడా కట్టలేదన్నారు. రాష‌్ట్రంలో ఐదు నెలలుగా జరుగుతున్న సంక్షేమ పథకాలు కనపడటం లేదా? అని ప్రశ్నించారు. సుజనా చౌదరి అని గూగుల్ లో వెతికితే బ్యాంకు దొంగగానే వస్తుందని అన్నారు. కేసుల మాఫీ కోసమే సుజనా చౌదరి పార్లమెంటుకు వస్తున్నారన్నారు.

Tags:    

Similar News