ఏపీ వైపు ఎవరూ చూడటం లేదు

అధికారులు వైసీపీ ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు. చదువుకున్న ఉద్యోగులు ప్రభుత్వానికి లొంగిపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ [more]

Update: 2021-04-03 01:09 GMT

అధికారులు వైసీపీ ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు. చదువుకున్న ఉద్యోగులు ప్రభుత్వానికి లొంగిపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ నేతల తీరుతో ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటేనే భయపడిపోతున్నారని సుజనా చౌదరి అన్నారు. ఉన్న కంపెనీలు కూడా వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలను న్యాయస్థానం తప్పుపడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను కూడా అడిగే పరిస్థిితి లేదని సుజనా చౌదరి అన్నారు. వైసీపీకి ఓట్లు వేసి దుర్వినియోగం చేసుకోవద్దని సుజనా చౌదరి అన్నారు.

Tags:    

Similar News