వైసీపీ ఎమ్మెల్యే పై కేసు నమోదు

జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదు చేశారు. దేవగుడి గ్రామ సమీపంలో [more]

Update: 2020-03-17 03:37 GMT

జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదు చేశారు. దేవగుడి గ్రామ సమీపంలో జరిగిన ఘర్షణలో సుధీర్ రెడ్డి ప్రమేయం ఉందని ఆదినారాయణరెడ్డి ఫిర్యాడు చేయడంతో వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై జమ్మలమడుగు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం ఆదినారాయణరెడ్డితో పాటు మరో 80 మందిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News