లోకేష్ చేత దీక్ష చేయించవచ్చు కదా?

చంద్రబాబు ఫేక్ నేతగా మారిపోయారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. వైసీపీ పేరుతో నకిలీ వెబ్ సైట్ సృష్టించి తప్పుడు ఫలితాలు చేరవేశారన్నారు. [more]

Update: 2021-02-16 08:01 GMT

చంద్రబాబు ఫేక్ నేతగా మారిపోయారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. వైసీపీ పేరుతో నకిలీ వెబ్ సైట్ సృష్టించి తప్పుడు ఫలితాలు చేరవేశారన్నారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీయే ఘన విజయం సాధించిందన్నారు. ఓటమి ఎదురయినప్పుడల్లా చంద్రబాబు మతితప్పిన వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఈవీఎంలపై తప్పు నెట్టడానికి ప్రయత్నించారన్నారు. నిన్న మొన్నటి వరకూ నిమ్మగడ్డ ను పొగిడిన చంద్రబాబు ఇప్పుడు తప్పుపడుతున్నారన్నారు. డైవర్ట్ పాలిటిక్స్ చేయడం చంద్రబాబుకు అలవాటని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. చంద్రబాబు సమయాన్ని బట్టి రంగులు మారుస్తారన్నారు. పంచాయతీ ఎన్నికలలో దారుణంగా ఓడిపోయి తాము బెదిరిస్తున్నామని చెబుతుండటం ఆయన మానసికస్థితికి అద్దం పడుతుందన్నారు. పల్లా శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థిితి దృష్ట్యా ఆసుపత్రికి తరలిస్తే దానిని కూడా రాజకీయం చేస్తున్నారన్నారు. పల్లా శ్రీనివాస్ కు కరోనా వచ్చి తగ్గడంతో ఆయన దీక్ష ఎక్కువ రోజులు చేయకూడదని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. లోకేష్ తో ఆమరణ దీక్ష చేయించవచ్చు కదా? అని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు.

Tags:    

Similar News