ఐదువేలు దాటాయ్… తెలంగాణలో వ్యాప్తి ఎక్కువగా?

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. కొత్తగా 219 కి కరోనా వ్యాధి సోకింది. కొత్తగా నమోదయిన కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ లోనే నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో [more]

Update: 2020-06-16 02:53 GMT

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. కొత్తగా 219 కి కరోనా వ్యాధి సోకింది. కొత్తగా నమోదయిన కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ లోనే నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,193కి చేరుకుంది. తెలంగాణలో ఐదు వేల కేసులు దాటడం ఆందోళన కల్గిస్తుంది. కొత్తగా నమోదయిన కేసుల్లో 189 హైదరాబాద్ పరిధిలోనే నమోదయ్యాయి. మొన్నటి వరకూ గ్రీన్ జోన్ లుగా ప్రకటించిన జిల్లాల్లో కూడా ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా కారణంగా 187 మంది మృతి చెందారు. ప్రస్తుతం కరోనా నుంచి కోలుకుని 2766 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం కరోనా వ్యాధి బారిన పడి 2,240 మంది చికిత్స పొందుతున్నారు.

Tags:    

Similar News