ఆ హత్యలో కొల్లు రవీంద్ర ప్రమేయం ఉంది

వైసీపీ నేత భాస్కర్ రావు హత్యకు జరిగిన కుట్రలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పాత్ర ఉందని జిల్లా ఎస్పీ రవీంద్ర నాధ్ బాబు తెలిపారు. నాంచారయ్య [more]

Update: 2020-07-04 06:45 GMT

వైసీపీ నేత భాస్కర్ రావు హత్యకు జరిగిన కుట్రలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పాత్ర ఉందని జిల్లా ఎస్పీ రవీంద్ర నాధ్ బాబు తెలిపారు. నాంచారయ్య కు, భాస్కరరావులకు మధ్య రాజకీయ గొడవలు కొంతకాలంగా ఉన్నాయన్నారు. 2013లోనే భాస్కర్ రావు హత్యకు కుట్ర జరిగిందన్నారు. కానీ అనుకోని కారణాలతో అప్పుడు చేయలేకపోయారన్నారు. భాస్కర్ రావు బతికుంటే తనకు రాజకీయంగా ఎదుగుదల ఉండదని భావించిన నాంచారయ్య కొల్లు రవీంద్రను నేరుగా కలసి మాట్లాడారన్నారు. తర్వాత ఫోన్ లోకూడా మాట్లాడారని, ఆ కాల్ డేటాను సేకరించినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుల వాంగ్మూలం మేరకే కొల్లు రవీంద్ర ను అరెస్ట్ చేశామన్నారు. భాస్కర్ రావు హత్య కొల్లు రవీంద్రకు తెలిసే జరిగిందని చెప్పారు. హత్య తర్వాత కూడా నాంచారయ్య కొల్లు రవీంద్రతో మాట్లాడరన్నారు. అన్ని రకాలుగా ఆధారాలను సేకరించిన తర్వాతనే కొల్లు రవీంద్రను అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. హత్యలో నేరుగా ముగ్గురు నిందితులు పాల్గొన్నారనిచెప్పారు.

Tags:    

Similar News