గుడ్ లక్… భవిష్యత్ మీదే

బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సినీనటుడు చిరంజీవిని కలిశారు. ఆయనతో సమావేశమై తాజా రాజకీయాలపై చర్చించారు. సోము వీర్రాజు అధ్యక్ష్య పదవి చేపట్టాక మర్యాదపూర్వకంగా పెద్దలను [more]

Update: 2020-08-07 01:44 GMT

బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సినీనటుడు చిరంజీవిని కలిశారు. ఆయనతో సమావేశమై తాజా రాజకీయాలపై చర్చించారు. సోము వీర్రాజు అధ్యక్ష్య పదవి చేపట్టాక మర్యాదపూర్వకంగా పెద్దలను కలుస్తున్నారు. ఈ మేరకు చిరంజీవితో గంట పాటు సమావేశమయ్యారు. ఇద్దరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి చర్చించుకున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన, బీజేపీ పొత్తు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఏపీలో బీజేపీ, జనసేనకు మంచి భవిష్యత్ ఉంటుందని చిరంజీవి ఈ సందర్భంగా ఆకాంక్షించారు. పవన్ తో కలసి ముందుకు వెళ్లాలని చిరంజీవి సోము వీర్రాజుకు సూచించారు.

Tags:    

Similar News