ఈరోజు తప్పించుకోగలిగామన్న సోమిరెడ్డి

వైెఎస్ జగన్ ప్రభుత్వం మొండిగా వెళ్లి వుంటే ఈరోజు స్థానిక సంస్థల పోలింగ్ జరిగేది అని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల [more]

Update: 2020-03-21 06:18 GMT

వైెఎస్ జగన్ ప్రభుత్వం మొండిగా వెళ్లి వుంటే ఈరోజు స్థానిక సంస్థల పోలింగ్ జరిగేది అని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల కమిషనర్ అడ్డుకోవడం వల్లనే విపత్తు నుంచి తప్పించుకోగలిగామని చెప్పారు. లేకుంటే కరోనా వైరస్ కారణంగా అనేక మంది ప్రజలు ఇబ్బందులు పాలయ్యేవారని సోమిరెడ్డి ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సయితం లేఖ రాసి వివాదంలో చిక్కుకుకున్నారన్నారు. ఐదు కోట్ల మంది ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిద్ధమవ్వడం శోచనీయమన్నారు. ఎన్నికల కమిషనర్ నిర్ణయంతోనే బతికి బయటపడగలిగామని చెప్పారు.

Tags:    

Similar News