సోమిరెడ్డి సీరియస్ కామెంట్స్

Update: 2018-10-26 06:52 GMT

ప్రజాస్వామ్యాన్ని గవర్నర్ అపహాస్యం చేశారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఏపీ పైన వ్యతిరేక రిపోర్టులు పంపడానికే గవర్నర్ సమయాన్ని వెచ్చిస్తున్నారన్నారు. గవర్నర్ ను దేశంలో ఏ రాష్ట్రంలోనైనా 12 సంవత్సరాలు చేసిన వారు ఉన్నారా? అని ప్రశ్నించారు. జగన్ బాబాయి వై.వీ.సుబ్బారెడ్డి గవర్నర్ చేత విచారణ జరిపించాలని కోరతారా? అని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వానికి ఏజెంటుగా గవర్నర్ మారారని ధ్వజమెత్తారు. కేసీఆర్ కు, కేంద్రానికి కీలుబొమ్మగా నరసింహన్ వ్యవహరిస్తున్నారని చంద్రమోహన్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు.

Similar News