టీడీపీకి ఎస్సీవీ గుడ్ బై… మూడింట ఓడిస్తానని ప్రకటన

చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయకుడు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు [more]

Update: 2019-03-30 12:06 GMT

చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయకుడు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రేపు ఆయన వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తమను చంద్రబాబు నాయుడు నమ్మించి మోసం చేశారని, ఐదేళ్ల నుంచి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వైఖరి వల్ల అనేక అవమానాలకు గురయ్యానని అన్నారు. కార్యకర్తల అభీష్టం మరకే పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. శ్రీకాళహస్తి, సత్యవేడు, గూడురు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీని ఓడిస్తానని ఆయన పేర్కొన్నారు.

Tags:    

Similar News