చంద్రబాబు, జగన్ నివాసాల వద్ద భద్రత పెంపు

రేపు ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నివాసాల వద్ద పోలీసులు భద్రతను పెంచారు. కౌంటింగ్ తర్వాత [more]

Update: 2019-05-22 07:34 GMT

రేపు ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నివాసాల వద్ద పోలీసులు భద్రతను పెంచారు. కౌంటింగ్ తర్వాత పెద్ద ఎత్తున నాయకులు చంద్రబాబు, జగన్ నివాసాలకు వచ్చే అవకాశం ఉండటంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. స్పెషల్ పార్టీ పోలీసులతో పాటు గుంటూరు అర్బన్ జిల్లా పోలీసులు భద్రత నిర్వహిస్తున్నారు. ఇద్దరు నేతల నివాసాల వద్ద భద్రత చర్యలపై సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆరా తీశారు.

Tags:    

Similar News