Ycp : వారికి సామినేని ఉదయభాను వార్నింగ్

తన కుమారుడిపై దుష్ప్రచారం చేస్తున్న వారిని వదిలిపెట్టబోనని వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వార్నింగ్ ఇచ్చారు. సామినేని ఉదయ భాను కుమారుడు వెంకట కృష్ణ ప్రసాద్ గంజాయి [more]

Update: 2021-09-26 03:27 GMT

తన కుమారుడిపై దుష్ప్రచారం చేస్తున్న వారిని వదిలిపెట్టబోనని వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వార్నింగ్ ఇచ్చారు. సామినేని ఉదయ భాను కుమారుడు వెంకట కృష్ణ ప్రసాద్ గంజాయి వ్యాపారం చేస్తున్నారంటూ కొందరు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. దీనిపై సామినేని ఉదయభాను మండపడ్డారు. దీనిపై తాను సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. గంజాయి వ్యాపారాన్ని పనికిరాని వెధవలు, సన్నాసులు చేస్తారని ఉదయభాను మండపడ్డారు. తనపైనా, తన కుమారుడిపైనా అసత్య ప్రచారం చేస్తే ఊరుకోబోనని హెచ్చరించారు.

Tags:    

Similar News