గెలిచినా అది గెలుపెట్లా అవుతుంది

తిరుపతి ఉప ఎన్నికలో ప్రజాస్వామ్యం అనేది కన్పించలేదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాకే శైలజానాధ్ అన్నారు. తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. [more]

Update: 2021-04-18 01:00 GMT

తిరుపతి ఉప ఎన్నికలో ప్రజాస్వామ్యం అనేది కన్పించలేదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాకే శైలజానాధ్ అన్నారు. తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారన్నారు. దొంగ ఓట్లతో గెలుద్దామనుకుంటే అది గెలుపు కాదని శైలజానాధ్ అభిప్రాయపడ్డారు. నైతికంగా గెలిచినట్లు కాదని, ఎన్నికల కమిషన్ కు తాము ఫిర్యాదు చేశామని, తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేసి మళ్లీ ఎన్నికను నిర్వహించాలని శైలజానాధ్ కోరారు.

Tags:    

Similar News