ఆ పాపం మోదీ జగన్ లదే

పెట్రోలు ధరల పెంపుదలకు ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి జగన్ బాధ్యత వహించాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాకే శైలజానాధ్ అన్నారు. పెట్రోలు ధరల పెంపుదలకు [more]

Update: 2021-07-07 06:53 GMT

పెట్రోలు ధరల పెంపుదలకు ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి జగన్ బాధ్యత వహించాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాకే శైలజానాధ్ అన్నారు. పెట్రోలు ధరల పెంపుదలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. తిరుపతి లోని పూలే విగ్రహం నుంచి సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పెట్రోలు ధరలను పెంచి సామాన్య ప్రజలపై భారం మోపుతున్న మోదీని గద్దె దించాలని శైలజానాధ్ పిలుపు నిచ్చారు. పెట్రోలు వంద రూపాయలకు చేరుకున్నందుకు మోదీ, జగన్ సిగ్గుపడాలని సాకే శైలజానాధ్ వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News