Sajjala : ఆ పాపం బీజేపీదే.. మాది కాదు

పెట్రోలు ధరల పెంపు పాపాన్ని రాష్ట్రాలపై నెట్టడం సరికాదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బీజేపీ అవాస్తవాలు ప్రచారం చేస్తుందన్నారు. పెట్రోలు ధరలు పెంచింది కేంద్ర [more]

Update: 2021-11-08 13:01 GMT

పెట్రోలు ధరల పెంపు పాపాన్ని రాష్ట్రాలపై నెట్టడం సరికాదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బీజేపీ అవాస్తవాలు ప్రచారం చేస్తుందన్నారు. పెట్రోలు ధరలు పెంచింది కేంద్ర ప్రభుత్వమేనని, 60 రూపాయలు పెంచి ఐదు రూపాయలు తగ్గించి ఏపీ ప్రభుత్వంపై నెట్టేందుకు ప్రయత్నిస్తుందన్నారు. తప్పు చేసింది బీజేపీయే కాబట్టి, సవరించాల్సింది, తగ్గించాల్సిందీ బీజేపీయేనని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పెట్రోలు ధరల పెంపుదలపై తాము వాస్తవాలను ప్రకటన రూపంలో ప్రజలకు వివరించామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

బాబు దొంగనాటకాలు….

ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెట్రోలు ధరల తగ్గుదలపై చర్యలు తీసుకోవాలని కోరారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం రోడ్డు సెస్సు పేరుతో రూపాయి మాత్రమే పెంచామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. చంద్రబాబు కూడా దొంగనాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

Tags:    

Similar News