ఎల్లోమీడియాపై పరువు నష్టం దావా వేస్తాం

తమపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న ఎల్లో మీడియాపై పరువు నష్టం దావా వేస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన ఏకగ్రీవాలపై ఎల్లో [more]

Update: 2021-03-05 01:17 GMT

తమపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న ఎల్లో మీడియాపై పరువు నష్టం దావా వేస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన ఏకగ్రీవాలపై ఎల్లో మీడియా తప్పుడు కథనాలను ప్రసారం చేస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. అయినా ప్రజలు అండగా ఉండటంతో అత్యధిక స్థానాలను వైసీపీ ఏకగ్రీవం చేసుకుందన్నారు. బెదిరింపులతో నామినేషన్లను ఎవరైనా ఉపసంహరించుకుంటారా? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదని, అందుకే అబద్ధాలను ఎల్లోమీడియా ద్వారా ప్రచారం చేయిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.

Tags:    

Similar News