రేపటి నుంచి బెజవాడలో

దాదాపు ఆరు నెలల నుంచి లాక్ డౌన్ కారణంగా తిరగని ఆర్టీసీ సిటీ బస్సులు రేపటి నుంచి విజయవాడలో తిరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ [more]

Update: 2020-09-18 02:14 GMT

దాదాపు ఆరు నెలల నుంచి లాక్ డౌన్ కారణంగా తిరగని ఆర్టీసీ సిటీ బస్సులు రేపటి నుంచి విజయవాడలో తిరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మార్చి 22వ తేదీ నుంచి లాక్ డౌన్ కారణంగా విజయవాడలో ఆర్టీసీ బస్సులు తిరగడం లేదు. మినహాయింపుల తర్వాత కూడా జిల్లా బస్సులు నడుస్తున్నాయి తప్ప, సిటీ సర్వీసులను ప్రభుత్వం ప్రారంభించలేదు. అయితే రేపటి నుంచి బస్సు సర్వీసులను పునరుద్ధరించనున్నట్లు ఏపీ ఆర్టీసీ అధికారులు తెలిపారు. వివిధ పరీక్షల ఉండటంతో విద్యార్థులు, అభ్యర్ధుల కోసం తొలి దశలో 200 నుంచి 300 బస్సులను సిటీలో తిప్పాలని ఆర్టీసీ నిర్ణయించింది.

Tags:    

Similar News